అగ్నిపథ్ నిరసనలకు కాంగ్రెస్ కారణమంటూ కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ఆరోపణలు చేశారు. యువకుడికి రక్షణ దళాల్లో 4 ఏళ్లపాటు సేవలందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలను ప్రేరేపించిందని ఆయన మండిపడ్డారు. ఈ నిరసన వెనుక కాంగ్రెస్ హస్తం ఉందనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే చేస్తున్న ధర్నాలే నిదర్శనమని బొమ్మై అన్నారు. అగ్నిపథ్ సైనిక శిక్షణ కోసం యువతను చేర్చుకునే విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉందని.. యువత 17-21 సంవత్సరాల వయస్సులో సైనిక శిక్షణ పొందినట్లయితే, వారు సేవలో పని చేసిన తర్వాత వారికి అనేక అవకాశాలు లభిస్తాయన్నారు. వారిని పారామిలటరీ బలగాల్లోకి చేర్చవచ్చని ఆయన అన్నారు.