Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ కేసు.. రేప్ తర్వాత పబ్ బేస్‍‌మెంట్‌లో బాలికను మళ్లీ వేధించిన నిందితులు!

రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు విషయం పట్ల సద్దుమణిగేలా కనిపించడం లేదు.

  • Written By:
  • Updated On - September 18, 2022 / 10:23 AM IST

రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు విషయం పట్ల సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఈ గ్యాంగ్ రేప్ కేసు విషయంలో రోజు ఏదో ఒక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విషయంలో భాగంగా తాజాగా ఐదుగురు నిందితులను ఈ రోజు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికే ఇందులో ఏ 1 నిందితుడు అయిన సాదుద్దీన్ మాలిక్ ను విచారించి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు నేడు మిగిలిన నిందితులను విచారించనున్నారు.

ఇకపోతే ఇప్పటికే జరిగిన మూడు రోజుల్లో ఆ ఐదుగురు మైనర్ నిందితులు విచారణ అధికారికి పలు వివరాలు చెప్పి నేరాన్ని అంగీకరించారట. ఇక తాజాగా సాదుద్దీన్ మాలిక్ వాంగ్మూలం తో మిగిలిన ఐదుగురిని పోలీసులు విచారించనున్నారు. అయితే పబ్ లో సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత బేస్మెంట్ లో బాలికను మళ్లీ వేధింపులకు గురి చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఇక పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఎందుకు సంబంధించిన వీడియో రికార్డులను సేకరించారు.

ఆరుగురు నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బాలిక తండ్రి ఆమెను అక్కడి నుంచి తీసుకు వెళ్లిపోయినట్లు నిందితులు తెలిపారు. ఇకపోతే ఈ కేసులో సాదుద్దీన్ మాలిక్ తప్ప మిగిలిన వారందరూ కూడా మైనర్ లే అని వారికి సంబంధించిన డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్స్, పూర్తి ఆధారాలు అన్నీ సేకరించాను అని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా కూడా ఈ విషయంలో ఇంకా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.