ITR Filing: కంపెనీల ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు తేదీ పొడిగింపు.. చివరి తేదీ ఇదే..!

ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు (ITR Filing) తేదీని పొడిగించింది. అయితే, ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాదు.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 09:25 AM IST

ITR Filing: ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు (ITR Filing) తేదీని పొడిగించింది. అయితే, ఇది సాధారణ పన్ను చెల్లింపుదారులకు కాదు. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీని ప్రభుత్వం ఇప్పుడు నవంబర్ 30 వరకు పొడిగించింది. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.

ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి కంపెనీలు చివరి తేదీని నవంబర్ 30 వరకు పొడిగించినట్లు సోమవారం ప్రభుత్వం తెలిపింది. ఇది కాకుండా తమ ఖాతాలను ఆడిట్ చేయాల్సిన కంపెనీలకు, ఆడిట్ నివేదికను సమర్పించడానికి గడువు తేదీని అక్టోబర్ 31 వరకు పొడిగించారు. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఫారమ్ ఐటీఆర్-7లో ఆదాయ రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీని 31.10.2023 నుండి 30.11.2023 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: Aditya L1 Spacecraft : భూమికి బైబై చెప్పిన ‘ఆదిత్య-ఎల్1’.. సూర్యుడి దిశగా స్పేస్ క్రాఫ్ట్

ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు దాఖలు చేసిన ITR గురించి మాట్లాడుకుంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం తన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి జూలై 31 వరకు రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. అందులో 53.67 లక్షలు మొదటిసారి ఐటీఆర్‌లు.

Also Read: Team India: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2లో భారత జట్టు.. ఆసీస్ తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంటే టాప్ ప్లేస్ లోకి..!

జూలై 31, 2023న ఐటిఆర్ ఫైలింగ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఒకే రోజులో 64.33 లక్షలకు పైగా ఐటిఆర్‌లు దాఖలు చేయబడ్డాయి. జూలై 31, 2023 వరకు మొదటిసారిగా ఫైల్ చేసిన వారి నుండి డిపార్ట్‌మెంట్ 53.67 లక్షల ఐటీఆర్‌లను పొందిందని డిపార్ట్‌మెంట్ తెలిపింది. 6.77 కోట్ల ఐటీఆర్‌లలో 5.63 కోట్ల రిటర్న్‌లు ఇ-వెరిఫై చేయబడ్డాయి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ఐటీఆర్ యుటిలిటీని ఉపయోగించి 46 శాతానికి పైగా ఐటీఆర్‌లు దాఖలు చేయబడ్డాయి.