Gyanvapi Case: వారణాసిలోని జ్ఞాన్వాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జ్ఞాన్వాపి కాంప్లెక్స్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో వారణాసి జిల్లా జడ్జి నిర్ణయాన్ని సవాలు చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు వేసిన పిటిషన్ను కూడా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఈ నిర్ణయంపై మధుర బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు.
#WATCH | Delhi: After Allahabad HC allows ASI survey of Gyanvapi mosque complex, BJP MP from Mathura Hema Malini says, "The decision should come as soon as possible otherwise talks keep happening. It will be good for the country if the final decision comes soon." pic.twitter.com/oIyx42k8fp
— ANI (@ANI) August 3, 2023
కోర్టు తీర్పు మంచి నిర్ణయమేనని అన్నారు. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఇష్యూపై త్వరగా నిర్ణయం వస్తే దేశానికి మేలు జరుగుతుందని తెలిపారు బీజేపీ ఎంపీ హేమమాలిని.
Also Read: Andhra Pradesh : ఆర్5 జోన్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుని ఆశ్రయించనున్న ఏపీ సర్కార్