Site icon HashtagU Telugu

ISIS Terrorist Rizwan: ప‌రారీలో ఉన్న ఉగ్ర‌వాదిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..!

ISIS Terrorist Rizwan

ISIS Terrorist Rizwan

ISIS Terrorist Rizwan: ఢిల్లీ పోలీసులు ఘన విజయం సాధించారు. ఐసిస్ (ISIS) మాడ్యూల్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసిస్ మాడ్యూల్‌కు చెందిన ఉగ్రవాదిని రిజ్వాన్ అలీ (ISIS Terrorist Rizwan)గా గుర్తించారు. అతడిపై దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రూ.3 లక్షల రివార్డును ప్రకటించింది. రిజ్వాన్ ఢిల్లీలోని దర్యాగంజ్ నివాసి. పూణె ఐసిస్ మాడ్యూల్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రిజ్వాన్ అని చెబుతున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అతన్ని అరెస్ట్ చేసింది. అతడి వద్ద నుంచి ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. రిజ్వాన్‌ను దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ వాంటెడ్‌గా ప్రకటించింది. చాలా కాలంగా పరారీలో ఉన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాది రిజ్వాన్ అలీ గురించి రహస్య సమాచారం అందింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలోని గంగా బక్ష్ మార్గ్ సమీపంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి .30 బోర్ స్టార్ పిస్టల్, మూడు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది.

Also Read: Kerala Landslide Victims: మూడు గంట‌ల‌పాటు భ‌ర‌తనాట్యం.. రూ.15,000 సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చిన బాలిక‌..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిజ్వాన్ ఐఎస్‌ఐఎస్‌కు చెందిన పూణే మాడ్యూల్‌లో భాగమని, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చబడ్డాడు. అతను జూలై 2023లో పూణే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. రిజ్వాన్‌పై ఎన్‌ఐఏ రూ.3 లక్షల రివార్డును ప్రకటించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఢిల్లీ-ఫరీదాబాద్ సరిహద్దు నుండి రిజ్వాన్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పట్టుబడ్డాడు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రిజ్వాన్‌ రాజధానిలో ఉన్నారనే దానిపై విచారణ జరుగుతోంది. అతడిపై యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొనడంతో అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా పోలీసు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులను గుర్తించాలని బుధవారం (ఆగస్టు 7) జరిగిన సమావేశంలో ఆయన పోలీసు అధికారులను కోరారు. తద్వారా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు.