ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్లోని గురుద్వారా కార్తే పర్వాన్పై ఉగ్రవాదులు దాడి చేశారు. గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ దాడి వెనుక ఐసిస్ ఖొరాసన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. కాబూల్ కాలమానం ప్రకారం ఉదయం 7:15 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 8.30 గంటలకు) దాడి ప్రారంభమైంది. ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారు.. ఆ తర్వాత వారిలో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. గురుద్వారా దగ్గర ఉన్న గార్డు కాల్చి చంపబడ్డాడు. ముగ్గురు తాలిబాన్ సైనికులు గాయపడగా..ఇద్దరు దాడిదారులను తాలిబన్ సైనికులు అడ్డుకున్నారు. కనీసం 7-8 మంది ఇంకా లోపల చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.