భారతదేశంలో గత 24 గంటల్లో 20,139 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 16,906 వేల కేసులు నమోదవుతుండగా, ఒక్కసారిగా 4 వేల కేసులు పెరిగి 20 వేలు దాటినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. దేశంలో మరో 38 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దేశవ్యాప్తంగా 5,25,557 కు చేరుకుంది. ఇది దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 0.31 శాతం. గత 24 గంటల్లో 16,482 మంది రోగులు కోలుకోవడంతో మొత్తం సంఖ్య 4,30,28,356కి చేరుకుంది. భారతదేశం రేటు 98.49 శాతంగా ఉంది. గురువారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా కోవిడ్-19 టీకా 199.27 కోట్లను అధిగమించింది.
➡️ 20,139 New Cases reported in last 24 hours. pic.twitter.com/qwuee0q48A
— Ministry of Health (@MoHFW_INDIA) July 14, 2022