Hyderabad: ఆదిబట్ల సమీపంలో కారులో వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు . ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదిబట్ల సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు చెలరేగాయి

Hyderabad: హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు . ఈ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆదిబట్ల సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై కారులో మంటలు చెలరేగాయి . ఈ మంటల ప్రభావంతో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అలాగే కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు కోదాడకు చెందిన వెంకటేష్‌గా గుర్తించారు . ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.కారులో ఎలా మంటలు చెలరేగాయి అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కారుకు ఎవరైనా నిప్పు పెట్టారా ? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Bigg Boss Tamil : బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫై దాడి ..