Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆకాశమంతా మేఘావృతమై, ఆకస్మికంగా వర్షం ప్రారంభమైంది. దీంతో రహదారులు నీటమునిగి, ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటనాస్థలాల నుంచి అందిన సమాచారం ప్రకారం, మాదాపూర్, హైటెక్ సిటీ, కోఠి, అమీర్పేట్, కూకట్పల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
Hydraa : హామీలు అమలు చేతకాక ‘హైడ్రా’ తో దౌర్జన్యం చేస్తారా ..? సాగర్ ప్రజల ఆగ్రహం
టోలిచౌకి, నాంపల్లి, మెహిదీపట్నం, ఎల్బీ నగర్, చైతన్యపురి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బేగంపేట్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే.. మరో రెండు గంటల్లో దక్షిణ హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ కోతలు అమల్లోకి వచ్చాయి. పలు కాలనీల్లో నీటి సరఫరా కూడా దెబ్బతిందని నివేదనలు వెలువడ్డాయి. హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) సిబ్బంది , ఎమర్జెన్సీ టీములు వర్షపు నీటిని తొలగించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేశాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నగర అధికారులు ఇచ్చిన హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం, అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. మున్ముందు రోజుల్లో ఈ ప్రభావం మరింతగా కనిపించి, పలు ప్రాంతాల్లో వర్షాలు తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యవసాయానికి అనుకూలం గా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తమ వ్యవసాయ పనులు సమయానుకూలంగా చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందువల్ల, ప్రజలు వాతావరణ సూచనలను గమనించి, అత్యవసర పరిస్థితులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
YCP Leaders Response: తిరుపతి లడ్డూపై సుప్రీం కోర్టు తీర్పు.. వైసీపీ నాయకుల స్పందన ఇదే!