Drugs : ముంబైలో భారీగా డ్ర‌గ్స్ స్వాధీనం.. ఇద్ద‌రు అరెస్ట్‌

ముంబైలోని కొరియర్ టెర్మినల్‌లో రూ.5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 07:58 AM IST

ముంబైలోని కొరియర్ టెర్మినల్‌లో రూ.5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒక మహిళతో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్ 28న DRI ముంబై జోనల్ యూనిట్ ఈ సరుకును స్వాధీనం చేసుకుంది. కస్ట‌మ్స్ అధికారులు గుర్తించకుండా ఉండేందుకు కొకైన్‌తో కూడిన చిన్న పౌచ్‌లను చెక్క వస్తువుల్లో దాచారని అధికారులు వెల్ల‌డించారు. 5 కోట్ల విలువైన 500 గ్రాముల కొకైన్‌తో కూడిన 56 పౌచ్‌లు ఉన్నాయని తెలిపారు. పార్శిల్ మీద ఉన్న మొబైల్ నెంబ‌ర్‌కు DRI బృందం కాల్ చేసింది. అలాంటి పార్శిల్ గురించి తనకు తెలియదని ఓ మ‌హిళ‌ సమాధానం ఇచ్చింది. ఆ బృందం KYC పత్రాలను తనిఖీ చేసి మరొక మొబైల్ నంబర్‌ను తీసుకున్నారు. దానికి సమాధానం ఇచ్చిన వ్యక్తి త‌న‌దే ఆ పార్శిల్ అని అధికారుల‌కు వెల్ల‌డించాడు. అత‌ను సరుకును సేకరించడానికి వచ్చినప్పుడు అతన్ని పట్టుకుని వివ‌రాలు రాబ‌ట్టారు.ఆ వ్య‌క్తితో పాటు మ‌రో మ‌హిళ‌ను కూడా అరెస్ట్ చేశారు.