Telangana CS: సీఎస్ సోమేష్, ఎక్సైజ్ శాఖకు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు…!!

తెలంగాణ డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో దాఖలైన ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

  • Written By:
  • Publish Date - April 7, 2022 / 03:05 PM IST

తెలంగాణ డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో దాఖలైన ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్బంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్ కు…ఈ కేసులో భాగంగా కోర్టు నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రికార్డులు ఇవ్వడంలేదంటూ ఈడీ దాఖలు చేసిన విచారణ సందర్భంగా సోమేశ్, సర్ఫరాజ్ లకు ధిక్కరణ నోటీసులు జారీ అయ్యాయి.

టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారంటూ దాఖలైన కేసును గతంలోనూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ వ్యవహారంలో మనీల్యాండరింగ్ కూడా జరిగిందన్న ప్రాథామిక సమాచారంతో ఈడీ ఈ కేసును నమోదు చేసింది. విచారణలో భాగంగా దర్యాప్తు బృందం సేకరించిన నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులను అందజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈడీ నేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అయితే ఈడీ అభ్యర్థనకు హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈడీ కోరిన వివరాలన్నింటినీ అందించాలంటూ గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసిన సర్కారు నుంచి ఎలాంటి వివరాలు అందలేదని..ఇప్పుడు మరోమారు ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఈడీ ఆరోపించింది. ఈ వాదన్నింటినీ విన్న హైకోర్టు సీఎస్ తోపాటు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 25 వాయిదా వేసింది హైకోర్టు.