AP High Court : అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచార‌ణ వాయిదా వేసిన హైకోర్టు

అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ

  • Written By:
  • Publish Date - November 11, 2023 / 07:21 PM IST

అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై విచారణను పునఃప్రారంభించాలన్న ఏపీ సీఐడీ పిటిషన్‌పై జస్టిస్ కె. కృపాసాగర్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తారని, అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోర్టుకు హాజరు కాలేకపోయారని.. ఈ కేసు విచారణను వాయిదా వేయాలని కోరుతూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్ రెడ్డి వాదించారు. అసైన్డ్ ల్యాండ్ స్కాం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2021లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.