Site icon HashtagU Telugu

Rains : అల్లకల్లోలంగా శ్రీకాకుళం

Rains Srikakulam

Rains Srikakulam

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు, ఈదురు గాలులు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు వీచి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితే స్థానిక ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలిగింది.

Immunity Boosters: వర్షాలు ఎక్కువగా పడుతున్నాయా.. అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ పండ్లు తినాల్సిందే!

మందస మండలం సవర టుబ్బూరులో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలిపోవడంతో బుద్దయ్య (65), రూపమ్మ (60) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వర్షాల కారణంగా ఇళ్లు బలహీనపడి ఉండటం వల్ల ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.

పలాస పరిధిలోని శాసనం గ్రామం సమీపంలో ఎమ్మెల్యే గౌతు శిరీష నివాసం వరద నీటితో చుట్టుముట్టబడింది. దీనితో అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు విభాగాలు సంయుక్తంగా పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరింత నష్టం జరగకుండా ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని, సహాయక బృందాలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version