ఢిల్లీలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పహర్గంజ్ పోలీస్ స్టేషన్లో తన సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ సెంట్రల్ డిస్ట్రిక్ట్లోని జాగ్వార్ టీమ్లో నియమించబడిన హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ తెల్లవారుజామున 3.30 గంటలకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం సెక్షన్ 174 CrPC కింద ప్రొసీడింగ్లు జరుగుతున్నాయని.. లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో పోస్ట్మార్టం నిర్వహించి, అతని మృతదేహాన్ని హర్యానాలోని సోనిపట్లోని అతని స్వస్థలానికి పంపినట్లు పోలీసులు తెలిపారు.