Summer: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమ్మర్ రాకపోకల కోసం ప్రత్యేక రైళ్లు

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 11:44 PM IST

Summer: వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌ -ముజఫరాబాద్‌, ముజఫరాబాద్‌ – సికింద్రాబాద్‌, గోరక్‌పూర్‌-మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ – గోరక్‌పూర్‌, కొచ్చువెలి-షాలిమార్‌, షాలిమార్‌-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్‌పూర్‌, భువనేశ్వర్‌-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్‌, తిన్‌సుకియా-బెంగళూరు, జబల్‌పూర్‌-కన్యాకుమారితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

ముజఫరాబాద్‌-సికింద్రాబాద్‌ (05293) మధ్య మంగళవారం ఈ నెల 23 నుంచి జూన్‌ 25 వరకు పది ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌-ముజఫరాబాద్‌ (05294) ప్రతి గురువారం ఈ నెల 25 నుంచి జూన్‌ 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గోరక్‌పూర్‌-మహబూబ్‌నగర్‌ (05303) మధ్య ఈ నెల 20 నుంచి జూన్‌ 29 వరకు ప్రతి శనివారం రైలు నడిపించనున్నట్లు చెప్పింది. మహబూబ్‌నగర్‌-గోరక్‌పూర్ (05304) మధ్య ఈ నెల 22 నుంచి జులై ఒకటి వరకు ప్రతి సోమవారం రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.