Site icon HashtagU Telugu

Gold Price: ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు..!

Gold

Todays Gold Rates

Gold Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,230గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ. 81,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (డిసెంబర్ 23, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Human Trafficking: భారతీయులతో వెళ్తున్న విమానం ఫ్రాన్స్‌లో నిలిపివేత.. కారణమిదే..?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,380గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,600 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,550గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.63,230 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,230గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,230గా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 79,500 ఉండగా, ముంబైలో రూ.79,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,000 ఉండగా, కోల్‌కతాలో రూ.79,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,750 ఉండగా, కేరళలో రూ.81,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.81,000 ఉండగా, విజయవాడలో రూ.81,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.