Gold- Silver: పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు పెరిగాయి.

  • Written By:
  • Updated On - November 26, 2023 / 07:40 AM IST

Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,100గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,290గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,200కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (నవంబర్ 26, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Rajasthan Assembly Polls: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 68.70 పోలింగ్ శాతం నమోదు..

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,440గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,100 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,290 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,290గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,290గా ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,200 ఉండగా, ముంబైలో రూ.77,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, కోల్‌కతాలో రూ.77,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,250 ఉండగా, కేరళలో రూ.80,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, విజయవాడలో రూ.80,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.