Gold Rates: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. మీ నగరంలో తులం ఎంతంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,290గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,410గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 07:03 AM IST

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.56,290గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,410గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,600కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (మే 23, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Skin Protection : పాలతో చర్మాన్ని ఎండాకాలంలో తాజాగా ఉంచుకోవడం ఎలా?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,440 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,560గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,950గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,410 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,460గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,000 ఉండగా, ముంబైలో రూ.75,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,600 ఉండగా, కోల్‌కతాలో రూ.75,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.78,600 ఉండగా, కేరళలో రూ.78,600గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,600 ఉండగా, విజయవాడలో రూ.78,600 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.