Gold Price Today: దిగొచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో నేటి ధరలివే..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Gold- Silver Buying Tips

Gold- Silver Buying Tips

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,700గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,760గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,200కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (మే 2, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Spam Calls: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి స్పామ్ కాల్స్‌కు చెక్

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,910గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,420గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,760 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,760గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,810గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,000 ఉండగా, ముంబైలో రూ.76,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, కోల్‌కతాలో రూ.76,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, కేరళలో రూ.80,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,200 ఉండగా, విజయవాడలో రూ.80,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 02 May 2023, 08:05 AM IST