Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధర క్షీణత.. నేటి ధరలివే..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) బుధవారం కూడా తగ్గాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,450గా నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Gold- Silver Price

Gold

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) బుధవారం కూడా తగ్గాయి. బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,450గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 75,700 పలుకుతోంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (మార్చి 29, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Health Benefits : గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి…ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.59,600గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,450 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,500గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,000 ఉండగా, ముంబైలో రూ.73,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, కోల్‌కతాలో రూ.73,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, కేరళలో రూ.75,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, విజయవాడలో రూ.75,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 29 Mar 2023, 09:14 AM IST