Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలివే.. తెలుగు రాష్ట్రాలలో ధర ఎంతంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,930గా నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Gold- Silver Price

Gold

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,930గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,700కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (ఏప్రిల్ 26, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,080గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,420గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,930 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,930గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980గా ఉంది.

Also Read: Parkash Singh Badal Death: మాజీ సీఎం ప్రకాష్ సింగ్ మృతి.. రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,700 ఉండగా, ముంబైలో రూ.76,700గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, కోల్‌కతాలో రూ.76,700గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, కేరళలో రూ.80,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700 ఉండగా, విజయవాడలో రూ.80,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 26 Apr 2023, 08:21 AM IST