Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. 24 క్యారెట్ల తులం రేట్ ఎంతంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి పెరిగాయి. శనివారం ఉదయం 9 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,150గా నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Gold- Silver

Gold- Silver

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి పెరిగాయి. శనివారం ఉదయం 9 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,150గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (ఏప్రిల్ 22, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Hidden Costs: నో-కాస్ట్ EMIలో హిడెన్ చార్జీలు ఉంటాయా..? ఉండవా..? నిజమేంటి..?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,300గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,150గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,050 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,150 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900 ఉండగా, ముంబైలో రూ.76,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,400 ఉండగా, కోల్‌కతాలో రూ.76,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,400 ఉండగా, కేరళలో రూ.80,400గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,400 ఉండగా, విజయవాడలో రూ.80,400 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 22 Apr 2023, 09:22 AM IST