Gold Price Today: నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాలలో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) భారీగా పెరిగాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా నమోదైంది.

Published By: HashtagU Telugu Desk
Gold Price

Gold Price

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) భారీగా పెరిగాయి. శనివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,800గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.83,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (ఏప్రిల్ 15, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,950గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,300 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,500గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850గా ఉంది.

Also Read: Hyderabad : నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు డాక్ట‌ర్ల‌పై మెడిక‌ల్ కౌన్సిల్ వేటు

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 79,600 ఉండగా, ముంబైలో రూ.79,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.83,000 ఉండగా, కోల్‌కతాలో రూ.79,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.83,000 ఉండగా, కేరళలో రూ.83,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.83,000 ఉండగా, విజయవాడలో రూ.83,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 15 Apr 2023, 08:28 AM IST