Gold Price: ఈరోజు బంగారం, వెండి కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. తులం ధర ఎంతో చెక్ చేసుకోండి..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.55,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 06:54 AM IST

Gold Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.55,600గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,650గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (జూన్ 07, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Darling Prabhas: ఆదిపురుష్ కోసం యుద్దం చేశాం: ప్రిరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,800గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,100గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,650 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,650గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,700గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,500 ఉండగా, ముంబైలో రూ.73,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, కోల్‌కతాలో రూ.73,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,500 ఉండగా, కేరళలో రూ.78,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, విజయవాడలో రూ.78,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.