Gold Price: భారీగా పెరిగిన ధరలు..నేడు బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్ తప్పదు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.56,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 07:01 AM IST

Gold Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Price) రూ.56,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,100గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,600కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (జూన్ 03, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,250గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,380 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,505గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,000 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,000గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,150గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,400 ఉండగా, ముంబైలో రూ.73,400గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,600 ఉండగా, కోల్‌కతాలో రూ.73,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా, కేరళలో రూ.78,600గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,600 ఉండగా, విజయవాడలో రూ.78,600 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.