ఉత్తరప్రదేశ్లోని ఓ బంగారం దుకాణంలో పట్టపగలు ఓ మహిళ ఖరీదైన నక్లెస్ని కొట్టేసింది. షాపులో అందరూ ఉండగానే వారి కళ్లుగప్పి ఆ మహిళ నెక్లెస్ని ఎత్తుకెళ్లింది. జాతేపూర్ ప్రాంతంలోని బల్దేవ్ ప్లాజాలో ఓ బంగారు దుకాణంలో రూ.10 లక్షల విలువైన నెక్లెస్ని పోయిందని షాపు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపులో సిబ్బంది పనిగా భావిచిన యాజమాని సీసీటీవీ పుటేజిని పరిశీలించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఓ మహిళ షాపులోకి వచ్చి సిబ్బందిని మాటల్లో పెట్టి నెక్లెస్ని చోరీ చేసినట్లు సీపీఫుటేజీలో గుర్తించారు.