Site icon HashtagU Telugu

Gold And Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Price

Gold Price

దేశంలో బంగారం ధరలు (Gold And Silver Price Today) మంగళవారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.52,600గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,440గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,000 పలుకుతోంది.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (ఫిబ్రవరి 7, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,590గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,650 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,530గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,440 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,440గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,440గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,440గా ఉంది.

Also Read: Modi-adani : పార్ల‌మెంట్ లో విప‌క్షాల ఆందోళ‌న‌, అదానీ గ్రూపు ప‌త‌నంపై ర‌చ్చ‌!

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,200 ఉండగా, ముంబైలో రూ.71,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కోల్‌కతాలో రూ.71,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కేరళలో రూ.74,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, విజయవాడలో రూ.74,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.