ఘజియాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తనతో హోట్లో రాత్రి బస చేయడానికి నిరాకరించని ప్రియురాలిని ఓ ప్రియుడు హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాగ్పట్కు చెందిన రచన ను.. ప్రియుడు గౌతమ్ను ఘజియాబాద్లో తరచుగా కలుసుకునేదని రచన భర్త రాజ్కుమార్ తెలిపారు. మృతురాలు డిసెంబరు 25న ఘజియాబాద్లోని ఓ హోటల్లో గౌతమ్ని కలిసింది. అయితే కొద్దిసేపటి తరువాత ప్రియుడు గౌతమ్ని రచన వెళ్లిపోవాలని పట్టుబట్టింది. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వదం చోటుచేసుకుంది. తనతో పాటు హోటల్లో ఉండటానికి ఇష్టపడని రచనను గొంతు నులిమి హత్య చేసినట్లు గౌతమ్ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. తనకు, బాధితురాలికి గత మూడు నెలలుగా సంబంధం ఉందని కూడా అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.