Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్‌లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు.

Chandrababu: మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్‌లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. ఈ సమావేశంలో గంటా శ్రీనివాసరావు అల్లుడు ప్రశాంత్ కూడా ఉన్నారు. కాగా చంద్రబాబుతో గంట, నారాయణ భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ రోజు ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ సంయుక్తంగా నిర్వహిస్తున్న చారిత్రాత్మక భారీ బహిరంగ సభ ‘ప్రజాగళం’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద జరుగుతున్న ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

Also Read: Rajamouli: మహేష్ మూవీకి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాజమౌళి.. కారణం అదే!