Covid -19 : టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిలో న‌లుగురికి కరోనా పాజిటివ్‌

పోలీసు శిక్షణ కళాశాలకి వచ్చిన నలుగురు టీటీడీ సిబ్బందికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పీటీసీ సీఐ...

  • Written By:
  • Publish Date - September 8, 2022 / 07:33 AM IST

పోలీసు శిక్షణ కళాశాలకి వచ్చిన నలుగురు టీటీడీ సిబ్బందికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పీటీసీ సీఐ నిరంజన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. టీటీడీ 100 మంది భద్రతా సిబ్బందిని శిక్షణ నిమిత్తం పీటీసీ వద్దకు పంపింది. PTCలోకి ప్రవేశించే ముందు, వ్యక్తులందరికీ కరోనా పరీక్ష జరిగింది. దీనిలో నలుగురు సిబ్బందికి పాజిటివ్ గా తెలింది. టీటీడీ అధికారులు నలుగురిని ప్రత్యేక వాహనంలో చికిత్స కోసం టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ట్రైనింగ్ సెంట‌ర్‌లో ఆందోన‌ళ మొద‌లైంది. అయితే పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన న‌లుగురిని పీటీసీలోకి అనుమతించలేదని సీఐ తెలిపారు.