4 Killed : నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ముక్పాల్ గ్రామంలో బుధవారం

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ముక్పాల్ గ్రామంలో బుధవారం ఉద‌యం కారు బోల్తా పడి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం మృత్యువాత ప‌డింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. టోలీచౌకీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో ప్రయాణిస్తుండగా టైర్ ఒకటి పగిలింది. దీంతో కారు బోల్తా పడింది. ఏడుగురు సభ్యుల్లో నలుగురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వీరంతా కారులో నిర్మల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  Last Updated: 10 Aug 2022, 09:41 AM IST