Accident : మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం…5గురు దుర్మరణం..!!

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 04:58 AM IST

మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలతోపాటు ఓ చిన్నారి, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోరిక్షాను ఢీ కొట్టటడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. జాఫ్రాబాద్ మహోరా రాహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జిన్నింగ్ ఫ్యాక్టరీ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.