Mumbai: ముంబయిలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

ముంబయిలోని విక్రోలి ఈస్ట్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. విక్రోలి ఈస్ట్ ప్రాంతంలోని డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు.

Mumbai: ముంబయిలోని విక్రోలి ఈస్ట్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. విక్రోలి ఈస్ట్ ప్రాంతంలోని డాక్టర్ అంబేద్కర్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. అయితే అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు.

ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున 1.47 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తెల్లవారుజామున 2.25 గంటల ప్రాంతంలో మంటలను ఆర్పివేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు శివాజీ ధేలే (65), విమల్ తివారీ (60), యశోదాబాయి రాథోడ్ (58), కాంతప్రసాద్ నిర్మల్ (75), అరుణ్ హరిభగత్ (64), మరియు సుస్మితా ఘోక్షే (23)గా గుర్తించి వారిని రాజావాడి ఆసుపత్రికి తరలించారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అంతకుముందు, ముంబైలోని మలాద్ ప్రాంతంలోని 22 అంతస్తుల భవనంలో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించలేదు.

Also Read: Custard Apple: సీతాఫలం తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!