దక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ స్థలంలో ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగాయి. పార్కింగ్లో పార్క్ చేసిన ఇతర కార్లకు ఈ మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే ఆ ప్రాంతం నుండి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. మంటలు అర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పార్క్ చేసిన ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన వివరాలను పోలీసులు తెలుసకుంటున్నారు. అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ప్రమాదంకి సంబంధించిన వివరాలను స్థానికులని అడిగి తెలుసుకున్నారు.