Tsunami: సునామీ రాబోతోందంటూ హెచ్చరికలు.. అర్ధరాత్రి గజగజ వణికిపోయిన జనం?

సునామీ..మనం ఎక్కువగా ఈ పదాన్ని సినిమాలలో వింటూ ఉంటాం. ఆ పేరు వింటేనే గజ గజ వణికి పోతూ ఉంటారు. అంతేకాకుండా వెన్నులో వణుకు పుడుతూ ఉం

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 03:24 PM IST

సునామీ..మనం ఎక్కువగా ఈ పదాన్ని సినిమాలలో వింటూ ఉంటాం. ఆ పేరు వింటేనే గజ గజ వణికి పోతూ ఉంటారు. అంతేకాకుండా వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. గతంలో చాలా సందర్భాలలో ఈ సునామీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సునామీ అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అని ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. సునామీ వచ్చిందింటే మనుషులు,ఇల్లు, రాళ్లు, రప్పలు ఏవి తేడా లేకుండా మొత్తం అన్ని తుడిచిపెట్టుకుపోతుంది. తాజాగా సునామి దెబ్బకు గోవా పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికారు.

అసలేం జరిగిందంటే.. అర్థరాత్రి మోగిన సునామీ సైరన్ వారి కంట కునుకు లేకుండా చేసింది. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా మోగిన సైరన్ అక్కడ ఉన్న వారందరిని మాత్రం టెన్షన్ పెట్టింది. గోవా రాజధాని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్‌ ప్రాంతంలో ఉన్న ఒక కొండపై ప్రభుత్వం సునామీ హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే సునామీ వచ్చే సూచనలు ఉంటే అది ముందుగానే పసిగట్టి విపత్తు గురించి అలర్ట్ చేస్తుంది. పెద్దగా సైరన్ మోత మోగిస్తూ జనాలను, అధికారులను అప్రమత్తం చేస్తుంది. అయితే బుధవారం రాత్రి 9 గంటల తరువాత ప్రమాద హెచ్చరికను తెలిపే అలారం కంటిన్యూస్ గా మోగింది.

దాదాపు 20 నిమిషాల పాటు అది మోగుతూనే ఉంది. దీంతో సునామీ రాబోతుందని ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడిపారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు సునామీకి సంబంధించి వాతావరణ శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. అలాగే ఎక్కడ భూమి కంపించిన దాఖలాలు కూడా లేవని అధికారులు తెలపారు. వాతావరణ కేంద్రంతో పాటు భూకంప పరిశోధన కేంద్రం నుంచి కూడా తమకు దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించింది. కేవలం అయితే టెక్నికల్ ప్లాబమ్ వల్లే ఇలా జరిగి ఉండవచ్చని ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ మము హెగే తెలిపారు. అయితే సైరన్ మోగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో కానీ ప్రజలకు మాత్రం ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయ్యింది. అర్ధరాత్రి వరకు ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పెట్టుకొని బతకాల్సిన పరిస్థితిలు వచ్చింది.