CM Revanth: సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహం: సీఎం రేవంత్

  • Written By:
  • Updated On - March 10, 2024 / 10:00 AM IST

CM Revanth: విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో స్థానికంగా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మేడ్చెల్‌-మల్కాజిగిరి జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన వస్తు ఉత్పత్తుల స్టాల్స్‌ను సందర్శించి మహిళలతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను ఆడబిడ్డల పేరుతో ఇవ్వాలన‍్న ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామన్నారు.

ఈ నెల12న సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో నిర్వహించే కార్యక్రమంలో మహిళా శక్తిని చాటుదామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.