Corona Alert: ఏలూరు కలెక్టరేట్‌లో నలుగురికి కోవిడ్‌ పాజిటివ్

Corona Alert: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విప్పుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తిరిగి పెరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
New Covid Variant

New Covid Variant

Corona Alert: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విప్పుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తిరిగి పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రజల్లో తిరిగి ఆందోళన నెలకొంటోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం సృష్టించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా పనిచేసే విభాగంలోని నలుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కలెక్టరేట్ కార్యాలయంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, ఆరోగ్యశాఖ తక్షణమే స్పందించి అక్కడ పనిచేస్తున్న మిగతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం

పాజిటివ్‌గా తేలిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. కార్యాలయంలో వారితో సంపర్కంలోకి వచ్చిన ఇతర ఉద్యోగులను కూడా గుర్తించి, జాగ్రత్త చర్యలుగా క్వారంటైన్‌లోకి పంపే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతకుముందు నాలుగు రోజుల క్రితం, ఏలూరులోని శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఇద్దరు వృద్ధులకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వారు ప్రస్తుతం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజా ఘటనతో కలిపి ఏలూరులో ఇప్పటివరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.

Easwaran Departs: రోహిత్ శ‌ర్మ రిప్లేస్‌మెంట్.. నిరాశ‌ప‌ర్చిన అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌!

కేవలం ఏలూరులో మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో కుటుంబంలోనే పలువురికి వైరస్ సోకిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. వైద్య నిపుణులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అప్రమత్తమై కోవిడ్ ప్రాథమిక నియమాలను పాటించాలని కోరుతున్నారు. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవడం, అవసరం లేకుండా బయటకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అలాగే, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు టీకాలు తీసుకున్నా కూడా నియమాలను పాటించడం తప్పనిసరిగా పేర్కొంటున్నారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రజల సహకారం అవసరం అని ప్రభుత్వ వైద్య అధికారులు స్పష్టం చేస్తున్నారు.

  Last Updated: 31 May 2025, 10:27 AM IST