దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది . పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. మమ్ముట్టి, మహేష్ బాబు, జాన్వీ కపూర్, అర్జున్ కపూర్, అమృతా అరోరా, కరీనా కపూర్ తో పాటు మరికొంత మంది ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు.
తాజాగా యువ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా కరోనా బాధితుల జాబితాలో చేరాడు. తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులందరికీ ఈ బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కరోనా నిర్థారణ పరీక్షల్లో తనకు పాజిటివ్ గా తేలిందని..స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే ఉన్నానని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు. గత కొన్ని రోజులుగా షూటింగ్ల సమయంలో తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు పరీక్షలు చేయించుకోని జాగ్రత్తలు తీసుకోవాలని కోరాడు.
Positive. pic.twitter.com/cv3OkQXybs
— Dulquer Salmaan (@dulQuer) January 20, 2022