HYD : మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ వీరంగం… ఇద్దరు యువకులపై కర్రలతో దాడి!!

మద్యం మత్తులో సోమవారం అర్థరాత్రి ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ వీరంగం స్రుష్టించాడు.

  • Written By:
  • Publish Date - October 4, 2022 / 11:00 AM IST

మద్యం మత్తులో సోమవారం అర్థరాత్రి ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ వీరంగం స్రుష్టించాడు. ఫుల్ గా మద్యం సేవించిన సైఫాబాద్ పీఎస్ కు చెందిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ బి. శ్రీనివాస్…తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నానా హంగామా చేశారు. బైక్ మీద వస్తున్న యువకులపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ యువకులదే తప్పు అంటూ వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆ యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ ఘటన ఖైరతాబాద్ ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూం బిల్డింగ్ వద్ద జరిగింది. బాధితులు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుల్ పై సైఫాబాద్ పీఎస్ ఫిర్యాదు చేశారు బాధితుల బంధువులు. అయితే ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తి కావడంతోనే తమకు న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.