ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) తెలుగు శాఖలో ‘తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమం- కరపత్ర సాహిత్యము’ అనే అంశం మీద వేల్పుకొండ వెంకటేష్ (Velpukonda Venkatesh) పరిశోధన చేశారు. ఇందుకుగాను యూనివర్సిటీ అధికారులు పీహెచ్డీ పట్టాను ఇచ్చారు కరపత్ర సాహిత్యం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. వివిధ ఉద్యమాల ప్రచారానికి కరపత్రమే ఆధారమైంది. ఫ్రెంచి విప్లవం మొదలుకొని భారతదేశ స్వతంత్ర పోరాటం వరకు కరపత్రం ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రధాన భూమికను పోషించింది.
తెలుగు నేలమీద కరపత్ర రచన ఒక సాహిత్య ప్రక్రియగా మారింది.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటం వివిధ అస్థిత్వ ఉద్యమాల సందర్భంలో కరపత్రం పోషించిన పాత్రను మనం విస్మరించలేము. కానీ ఇంతటి ప్రాధాన్యం కలిగిన కరపత్ర సాహిత్యం పైన ఇప్పటి వరకు ఒక్క పరిశోధన కూడా జరగలేదు. ఈ లోటును పూరించడం కోసం వేల్పుకొండ వెంకటేష్ (Velpukonda Venkatesh) అనే పరిశోధకుడు పూనుకొని ఆరు సంవత్సరాల పాటు శ్రమించి కరపత్ర సాహిత్యాన్ని సేకరించి పరిశోధన పూర్తి చేశాడు. కరపత్రాన్ని ముద్రించి ఆ తర్వాత మరచిపోవడం అన్ని ఉద్యమ సందర్భాలలో మనం గమనిస్తూ ఉంటాం. అట్లా విస్మరణకు గురైన వివిధ రకాల కరపత్రాలను సేకరించి, విశ్లేషించి క్రమ పద్ధతిలో వెంకటేష్ పరిశోధన చేశాడు.
తెలంగాణ ఉద్యమంలో స్వయంగా ఈ పరిశోధకుడు పాల్గొని రాష్ట్రం సిద్ధించాక పరిశోధనలు పూర్తి చేయడం సంతోషించదగిన విషయం. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, చీకటాయపాలెం గ్రామంలో పేద, దళిత కుటుంబంలో తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటయ్య లకు ఐదుగురు సంతానంలో మొదట పుట్టిన వేల్పుకొండ వెంకటేష్ (Velpukonda Venkatesh), ఓయూ జే ఏ సీ కన్వీనర్ , BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కు డాక్టర్ పట్టా పొందడం ఈ ప్రాంతానికి గర్వకారణమని ప్రాఫెస్సర్స్, గురువులు గ్రామ ప్రజలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తదితులు అందరూ శుభాకాoక్షలు తెలియజేశారు.
Also Read: Rats Eat Cannabis: గంజాయి తిన్న ఎలుకలు.. కేరళ కోర్టు తీర్పులో బిగ్ ట్విస్ట్!