Hyderabad: డీజీల్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్.. 10 లక్షల విలువ డీజీల్ పట్టివేత

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 09:00 PM IST

Hyderabad: కర్ణాటక నుండి డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ను పోలీసులు పట్టుకుననారు. 10 లక్షల విలువ చేసే 10800 లీటర్ల డీజిల్, 35 లక్షల విలువ చేసే 7 చిన్న డీజిల్ ట్యాంకర్లు లను స్వాధీన పర్చుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. బుధవారం మాదాపూర్ టీం మరియు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా గచ్చిబౌలి PS పరిది లోని వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీర్ కళాశాల ముందు నిఘా వేసి పట్టుకున్నారు. కర్ణాటక నుండి అక్రమంగా తరలించిన 10 లక్షల విలువ చేసే 10800 లీటర్స్ డీజిల్ ను మరియు 7 చిన్న ట్యాంకర్ లను 7 మంది డ్రైవర్ లను పట్టుకున్నారు.

విచారణలో  రాధాకృష్ణ అనే పేరున్న వ్యాపారస్తుడు డీజిల్ స్మగ్లర్ గా రూపాంతరం చెంది కోట్ల రూపాయల డీజిల్ ను కర్ణాటక నుండి తెలంగాణకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ చేస్తున్న స్మగ్లింగ్ ద్వారా నెలకు కొన్ని కోట్లలో తెలంగాణా రాష్ట్ర ఖజానాకు గండ్డి పడుతున్నట్లు సమాచారం. స్మగ్లర్ రాధాక్రిష్ణ సురేష్ ఒక్కరికే కాకుండా తెలంగాణలో ఇంకా చాలా మందికి సప్లయి చేస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కూడా ఇదే స్మగ్లర్ రాధాక్రిష్ణ ఇదే ప్లేస్ లో 18000 లీటర్స్ డీజిల్ అఫిషియల్ ట్యాంకర్ ద్వారా సప్లయి చేస్తూ సైబరాబాద్ SOT చేతికి దొరికి పోవడం గమనార్హం.