Devineni Uma: సన్న బియ్యం ఇవ్వలేని సన్నాసీకి రాజ‌కీయాలు ఎందుకు..?

  • Written By:
  • Publish Date - February 12, 2022 / 11:49 AM IST

ఏపీలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌లు యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలోతాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, వైసీపీ మంత్రి కొడాలి నాని పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపుతున్నాయి. బూతుల మంత్రి కృష్ణా జిల్లా పరువు తీస్తున్నాడని, కొడాలి నాని పై అభ్యంతరకరరీతిలో పదజాలం వాడుతూ దేవినేని ఉమా ఫైర్ అయ్యాడు. నాడు చంద్ర‌బాబు బూట్లు నాకిన‌ వ్య‌క్తి అంటూ కొడాలి పై దేవినేని షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌తంలో టీడీపీ అధినేత‌ చంద్రబాబు రాజకీయంగా బిక్ష పెడితే, కొడాలి నాని ఈ స్థాయికి వచ్చాడ‌ని దేవినేని ఉమా అన్నారు.

అస‌లు కొడాలి నానికి రాష్ట్రంలోని జిల్లాల గురించి, స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇక పొట్టకోస్తే అక్షరం రాదు కానీ, అచ్చోసిన ఆంబోతులాగా అర‌వ‌డం మాత్రమే కొడాలి నానికి వ‌చ్చన్నారు. కొడాలి నాని మాట్లాడే భాషను ప్ర‌తి ఒక్క‌రు ఛీద‌రించుకుంటున్నార‌ని, ప‌శువులా చూస్తున్నారని దేవినేని ఉమా అన్నారు. ఇక‌సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసివి నీకెందుకురా రాజకీయం, కేసులు పెడితే ఇక్క‌డ భ‌య‌ప‌డేవాళ్ళెవ‌రు లేర‌ని కొడాలి నాని పై దేవినేని ఉమా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మ‌రి దేవినేని ఉమా వ్యాఖ్య‌ల పై కొడాలి నాని రియ‌క్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి.