ఐఆర్ కు విచిత్ర నిర్వచనం. చెప్పిన ఏపీ సీఎస్ సమీర్ శర్మ మీద ఉద్యోగ సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. వడ్డీలేని రుణం గా ఉద్యోగులకు ఇచ్చిన ఐఆర్ గురించి సీఎస్ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం పెడుతూ ఉద్యోగ సంఘాల నేతలు వ్యంగ్యాస్త్రాలను విసురుతున్నారు.ఛలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణను బలంగా చాటిన నేపథ్యంలో నిన్న ఏపీ సీఎస్ సమీర్ శర్మ పలు వ్యాఖ్యలు చేశారు. ఐఆర్ గురించి ప్రస్తావిస్తూ వడ్డీ లేని రుణం అని అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పందిస్తూ, ఐఆర్ అంటే వడ్డీ లేని రుణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇవాళ ఇచ్చిన పీఆర్సీని కూడా రేపు రుణం అంటారేమో అని వ్యంగ్యం అన్నారు.పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఇచ్చి తీరాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక పొందడం తమ హక్కు అని స్పష్టం చేశారు. ఇవాళ్టి పీఆర్సీ సాధన సమితి సమావేశంలోనూ ఇదే తీర్మానం చేశామని చెప్పారు. కనీస వేతనంపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ 2018లో నివేదిక ఇచ్చిందన్నారు. కేంద్ర కమిటీ నివేదికను అశుతోష్ మిశ్రా కమిటీ అనుసరించిందా.. లేదా? అని సూర్యనారాయణ అడిగారు. ఉద్యోగులు 13వ పీఆర్సీలో ఉండాల్సిన సమయంలో 11వ పీఆర్సీలో ఉన్నారని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు రెండు పీఆర్సీలు కోల్పోయారని వెల్లడించారు. ఫైనల్ పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు.