ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 980 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 26 శాతంతో 2876కి చేరుకుంది. కేసుల పెరుగుదల నేపథ్యంలో వైద్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణలు తెలిపారు. వ్యాక్సిన్ల బూస్టర్ డోస్లను పొందాలని సూచించారు. దేశ రాజధానిలో COVID-19ని ఎదుర్కోవడానికి వారి సంసిద్ధతను నిర్ధారించడానికి ఢిల్లీలోని ఆసుపత్రులలో మాక్ డ్రిల్లు నిర్వహించాయి. ఢిల్లీ నగరంలో ఆదివారం దాదాపు 700 కోవిడ్ కేసులు మరియు నాలుగు మరణాలు నమోదయ్యాయి. అయితే అది మంగళవారానికి 200 కేసులు పెరిగాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా నివారణ చర్యలను వేగవంతం చేసింది.