Hyderabad: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా హైదరాబాద్లో వైన్షాపులను బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైన్ షాపు యజనమానులకు పోలీసులు సమచారాన్ని అందిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించి వైన్ షాపులను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇవాళే మందుబాబులు సరుకు కొనిపెట్టుకొని జాగ్రత్త పడుతున్నారు. ఇక తెలంగాణలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
Also Read: Kitchen Tips : టమాటాను ఎక్కువ కాలం నిల్వ చేసే టిప్స్