ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 60 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 4,491 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,24,59,939 కోట్ల కరోనా కేసులు నమోదవగా, 5,16,132 మంది కరోనా కారణంగా మరణించారు.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4,24,50,055 కోట్ల మంది కరోనా నుంచి కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 30,799 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.35 శాతం ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో 1,80,80,24,147 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇకపోతే బుధవారం నుంచి దేశంలో 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే 2.60 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు అందించారు.
India reports 2,539 fresh #COVID19 cases, 4,491 recoveries, and 60 deaths in the last 24 hours.
Active case: 30,799 (0.07%)
Daily positivity rate: 0.35%
Total recoveries: 4,24,54,546
Death toll: 5,16,132 pic.twitter.com/adYcCfPevz— ANI (@ANI) March 17, 2022