మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాయపడ్డారు. ఈ ఘటనలో కేసీ వేణుగోపాల్ చేతికి, మోకాలికి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీని కలవడానికి ప్రజలు తరలిరావడంతో రద్దీ ఏర్పడింది. ఆ సమయంలో పోలీసులు ప్రజల్ని నియంత్రించలేకపోయారు.దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. యాత్ర కోసం ఏర్పాటు చేసిన శిబిరంలో కేసీ వేణుగోపాల్కి ప్రథమ చికిత్స అందించారు.