CM Revanth Reddy : రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Revanth Tirumala

Revanth Tirumala

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనానికి (Tirumala) వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు రేపటి నుంచి ఈ నెల 19 వరకు వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార ద్వారా ప్రత్యేక దర్శనాలు నిర్వహించనున్నారు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాకిస్థాన్ నుంచి లాగేసుకుంటారా?

ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రొటోకాల్ ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి రేపు తెల్లవారుజామున 4:30 గంటలకు స్వామివారి దర్శనాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యేక దర్శనాల కోసం భక్తులకు వేర్వేరు గేట్ల ద్వారా ప్రవేశం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి.

వైకుంఠ ద్వార దర్శనం.. డిమాండ్ ఎందుకంటే..

హిందువులు ముక్కోటి ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో ఆలయ ప్రవేశం సర్వపాప హరమని విశ్వాసం. ఇక భూలోక వైకుంఠంగా భావించే తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనమంటే సాక్షాత్తూ ఆ వైకుంఠ ధామంలోకి ప్రవేశించినట్లుగా పులకరిస్తారు. ఏడాదిలో 10రోజులు మాత్రమే టీటీడీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే నిన్న ఈ దర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

  Last Updated: 09 Jan 2025, 01:02 PM IST