తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ తో భేటీకానున్నారు. కొత్త టీపీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని ఖరారు చేసేందుకు, ఖాళీగా ఉన్న ఆరు కేబినెట్ , ఇతర ముఖ్యమైన స్థానాలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఒకటి లేదా రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వారం రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లినా.. రాహుల్ గాంధీ ఇతర అపాయింట్మెంట్లలో బిజీగా ఉండడంతో పేర్లు ఖరారు కాలేదు. దేశ రాజధానిలో తన పర్యటన సందర్భంగా, 2 లక్షల పంట రుణాల మాఫీ హామీని విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తుచేసే బహిరంగ సభకు రాహుల్ గాంధీని సిఎం ఆహ్వానించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని కూడా ఆయన ఆహ్వానించే అవకాశం ఉంది.
అదానీ గ్రూప్లో జరిగిన ఆరోపణలపై విచారణ జరిపించాలని, సెబీ చైర్పర్సన్ అవకతవకలపై జెపిసిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జరిగే నిరసన కార్యక్రమంలో సీఎం పాల్గొనే అవకాశం ఉంది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా పెడతారని బీఆర్ఎస్ విమర్శిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలిగించి.. ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు తొలిగించి.. జయశంకర్ లేదా నర్సింహారావు పేర్లను పెడతామని కేటీఆర్ అన్నారు. అయితే.. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
Read Also :Happy Birthday Megastar : వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్..!