Telangana : కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయం!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో..

  • Written By:
  • Updated On - December 18, 2021 / 08:19 PM IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరిధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఒక్క కిలో వడ్లు కూడా కొనలేదని, రాష్ట్రం లో యాసంగి  ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోవడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు పునరుద్ఘాటించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి,  ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సీఎం కెసీఆర్ కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను సీఎం ఆదేశించారు.

తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసే దిశగా తెలంగాణ రాష్ట్రం  అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్ర లో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. వీటిని కొనసాగిస్తామని స్పష్టం చేసారు.  రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. వానాకాలం లో ప్రధానంగా పత్తి, వరి., కంది సాగు పై దృష్టి సారించాలని కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను  కేసిఆర్ ఆదేశించారు.రైతులను ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు.